పెళ్లికి వెళ్లి అనంత లోకాలకు....

ABN , First Publish Date - 2021-10-17T04:53:14+05:30 IST

బంధువుల పెళ్లి చూసుకు ని తిరుగుపయనంలో విద్యుదాఘాతానికి గురై గౌరీశంకర్‌ (28) దుర్మరణం చెందాడు.

పెళ్లికి వెళ్లి అనంత లోకాలకు....
విద్యుత్‌ షాట్‌ సర్క్యూట్‌తో మృతి చెందిన గౌరీశంకర్‌

బస్సుపై తీగలు తెగిపడి ఒకరు మృతి - ముగ్గురికి గాయాలు

సంబేపల్లె, అక్టోబరు16: బంధువుల పెళ్లి చూసుకు ని తిరుగుపయనంలో విద్యుదాఘాతానికి గురై గౌరీశంకర్‌ (28) దుర్మరణం చెందాడు. సంబేపల్లె కస్పావాసులు పట్టన్న, కమలమ్మ దంపతుల కు మారుడు గౌరీశంకర్‌ హైదరాబాద్‌లో ఉంటూ మిమిక్రీ చేస్తూ జీవనం సాగించేవాడు. కాగా చిత్తూరు జిల్లా కల్లూరులో బంధువుల పెళ్లికి వెళ్లాలని స్వగ్రామం చేరుకున్నాడు.

బస్సులో పెళ్లి కి వెళ్లి స్వగ్రామానికి తిరుగు పయనంలో  పెళ్లి బ స్సును ముందుకు కదిలించారు. దీంతో బస్సు కు ఆనుకుని ఉన్న విద్యుత్‌ తీగలు తెగి బస్సుపైన పడడంతో బస్సు కంతటికీ విద్యుత్‌ సరఫరా జరి గింది. దీంతో పెళ్లి బస్సులో ఉన్న రెడ్డెయ్య, నరసింహులు, చరణ్‌కు కాళ్లు, చేతులు కాలాయి. గౌరీశంకర్‌ అక్కడికక్కడే మృతి చెందాడు.

మిమిక్రీతో అందరినీ కడుపుబ్బా నవ్వించే గౌరీశంకర్‌ తల్లిదండ్రులు, బంధువులను శోకసముద్రంలో ముంచారు. విష యం తెలుసుకున్న మండిపల్లి రాంప్రసాద్‌రెడ్డి గౌరీశంకర్‌ మృతదేహం వద్ద నివాళు లర్పించారు. మృతుడి కుటుంబానికి రూ.10 వేలు ఆర్థిక సహాయం అందించారు.  మాజీ సర్పంచ్‌ నాగేశ్వర్‌నాయుడు, సుబ్బరాజు, మెడికల్‌ స్టోర్‌ అన్నారెడ్డి ఉన్నారు. 

ట్రాక్టర్‌ మిల్లర్‌ కిందపడి..

గాలివీడు, అక్టోబరు16: గుండ్లచెరువు గ్రామం బురుజుపల్లె-2 పరిధిలోని వడ్డిపల్లె వాసి కుర్రపోతుల గోవింద్‌ (27)ట్రాక్టర్‌ మిల్లర్‌ కిందపడి మృతి చెందాడు. పొలంలో ట్రాక్టర్‌తో సేద్యం చేస్తుండగా శనివారం మధ్యాహ్నం ప్రమాదవశాత్తు ట్రాక్టర్‌ మిల్లర్‌ కిందపడి గాయపడ్డాడు. వెంటనే గోవింద్‌ను చికిత్స నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం తిరుపతికి  తరలిస్తుం డగా మార్గమధ్యలో మృతి చెందాడని బంధువులు తెలిపారు. పోలీసులు కేసు నమో దు చేసి పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడు గోవింద్‌కు భార్య, కుమార్తె ఉన్నారు.  

రైలు ఢీకొని వృద్ధుడు...

కడప(క్రైం), అక్టోబరు 16: కడప నగరం మేరి నగర్‌ వాసి కొల్లే సుబ్బరాయుడు శనివారం రైలు పట్టాలు దాటుతూ ప్రమాదవశాత్తూ రైలు ఢీ కొనడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కడప రైల్వే ఎస్‌ఐ రారాజు కథనం మేరకు... సుబ్బరాయుడు  రోజూ ఉదయం రైలు పట్టాలు దాటి ఖాళీ బహిర్భూమికి వెళ్లేవాడు. ఈ క్రమంలో శనివారం కూడా అక్కడికి వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొనడం తో మృతిచెందారు. మృతదేహాన్ని రిమ్స్‌కు తరలించి  కేసు నమోదు చేశామన్నారు.

Updated Date - 2021-10-17T04:53:14+05:30 IST