చైనా వస్తువులను రాష్ట్రంలో నిషేధించాలి: బీజేపీ ప్రధాన నేత

ABN , First Publish Date - 2020-06-03T00:04:46+05:30 IST

చైనా వస్తువులను వినియోగాన్ని పూర్తిగా బహిష్కరిచాలని బీజేపీ గోవా ప్రధాన నేత సదానంద సేట్ తనవాడే...

చైనా వస్తువులను రాష్ట్రంలో నిషేధించాలి: బీజేపీ ప్రధాన నేత

పానాజీ: చైనా వస్తువులను వినియోగాన్ని పూర్తిగా బహిష్కరిచాలని బీజేపీ గోవా ప్రధాన నేత సదానంద సేట్ తనవాడే పేర్కొన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ దీనిని ఓ నియంమంగా పాటించాలని ఆయన కోరారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సరిహద్దుల్లో చైనా ఆటలాడుతోందని, అయితే ప్రధాని నరేంద్ర మోదీ దానికి ధీటుగా సమాధానం చెబుతున్నారని, అయితే భారత్‌పై కయ్యానికి కాలు దువ్వుతున్న చైనా దురాక్రమణ విధానాన్ని అణచివేయాలంటే ఆ దేశ వస్తువులను బహిష్కరించడమే మార్గమని సదానంద పేర్కొన్నారు. గోవా రాష్ట్ర వ్యాప్తంగా ఇది అమలు జరగాలని, దీనికి ప్రజలే స్వచ్ఛందంగా మద్దతు ఇవ్వాలని కోరారు.

Updated Date - 2020-06-03T00:04:46+05:30 IST