Goa: ఉప ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

ABN , First Publish Date - 2022-01-12T00:02:01+05:30 IST

Goa: ఉప ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

Goa: ఉప ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

పనాజి: గోవా రాష్ట్రంలో మళ్లీ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కట్టడికి గోవా రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ రోజురోజుకూ కోవిడ్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గోవా ఉప ముఖ్యమంత్రి మనోహర్ అజ్గాంకర్‌కు కరోనా పాజిటివ్ వచ్చినట్లు వైద్య అధికారులు పేర్కొన్నారు. వైద్యుల సూచన మేరకు ఆయన గోవా రాష్ట్ర రాజధాని పనాజిలోని మణిపాల్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు. గోవాలో సోమవారం నాటికి కొత్తగా 1,592 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం గోవా రాష్ట్రం కోవిడ్ పాజిటివిటీ రేటు 27 శాతంగా ఉందని రాష్ట్ర వైద్య శాఖ పేర్కొంది. రాష్ట్రవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జనవరి 26 వరకు పాఠశాలలు, కళాశాలలను మూసివేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.

Updated Date - 2022-01-12T00:02:01+05:30 IST