గోఎయిర్ రూ.3,600 కోట్ల ఐపీఓ
ABN , First Publish Date - 2021-05-15T05:56:33+05:30 IST
గో ఫస్ట్గా పేరు మార్చుకున్న గో ఎయిర్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు రాబోతోంది. క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి ‘సెబీ’కి ప్రాథమిక పత్రాలు కూడా సమర్పించింది
న్యూఢిల్లీ: గో ఫస్ట్గా పేరు మార్చుకున్న గో ఎయిర్ తొలి పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీఓ)కు రాబోతోంది. క్యాపిటల్ మార్కెట్ నియంత్రణ మండలి ‘సెబీ’కి ప్రాథమిక పత్రాలు కూడా సమర్పించింది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.3,600 కోట్లు సేకరించాలని ఈ ఎయిర్లైన్స్ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా రుణ బకాయిలను తీర్చేందుకు నిధులను ఉపయోగించాలని భావిస్తోంది. వాడియా గ్రూప్నకు చెందిన ఈ ఎయిర్లైన్స్.. 15 ఏళ్ల క్రితం కార్యకలాపాలు ప్రారంభించింది. ఐపీఓ ద్వారా స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో లిస్ట్ కానున్న నాలుగో ప్రైవేట్ ఎయిర్లైన్స్ ఇది. జెట్ఎయిర్వేస్, ఇండిగో, స్పైస్జెట్ ఇప్పటికే స్టాక్ ఎక్స్ఛేంజ్ల్లో లిస్టయ్యాయి. ఆర్థికంగా దివాలా తీసిన జెట్ ఎయిర్వేస్ మాత్రం 2019 ఏప్రిల్లో మూతపడింది.