15 నుంచి గోయిర్ బుకింగ్స్ ప్రారంభం

ABN , First Publish Date - 2020-04-07T01:37:55+05:30 IST

ఈ నెల 15 నుంచి దేశవాళీ విమానాలు, మే 1 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులు నడిపేందుకు బడ్జెట్ ఎయిర్‌లైన్స్

15 నుంచి గోయిర్ బుకింగ్స్ ప్రారంభం

ముంబై: ఈ నెల 15 నుంచి దేశవాళీ విమానాలు, మే 1 నుంచి అంతర్జాతీయ విమానాలకు బుకింగ్స్ ప్రారంభించేందుకు బడ్జెట్ ఎయిర్‌లైన్స్ గో ఎయిర్ రెడీ అవుతోంది. 15 నుంచి దేశవాళీ విమానాలకు బుకింగ్స్ ప్రారంభమవుతాయని ఆ సంస్థ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు. అలాగే, మే 1నుంచి అంతర్జాతీయ విమానాలకు బుకింగ్స్ ప్రారంభించనున్నట్టు చెప్పారు. కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో గత 24 నుంచి అన్ని విమాన సర్వీసులు నిలిచిపోయాయి. విమానాల రద్దును ఏప్రిల్ 14 వరకు పొడిగిస్తున్నట్టు మార్చి 27న ప్రభుత్వం ప్రకటించింది. విమాన సర్వీసుల ప్రారంభంపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన రాలేదు. లాక్‌డౌన్ ముగిసిన తర్వాత ఈ విషయంలో ప్రభుత్వం ప్రకటన చేసే అవకాశం ఉంది. కాగా, దేశంలో ఇప్పటి వరకు 4,067 కరోనా కేసులు నమోదు కాగా, 109 మంది ప్రాణాలు కోల్పోయారు. 

Updated Date - 2020-04-07T01:37:55+05:30 IST