పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2020-06-05T10:31:40+05:30 IST

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా తెలిపారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

  • డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

కడప, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా తెలిపారు. గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా కంప్యూటర్‌ బటన్‌ నొక్కి ఆన్‌లైన్‌ ద్వారా నేరుగా వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర లబ్ధిదారులకు నగదు జమ చేశారు. ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జిల్లాలో 13,672 మందికి రూ.13,67,20,000 విడుదల చేశారు. కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో ఉపముఖ్యమంత్రితో పాటు కలెక్టర్‌ హరికిరణ్‌, ఎమ్మెల్యేలు రవీంద్రనాధరెడ్డి, వెంకటసుబ్బయ్యలు పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఆటో, క్యాబ్‌, కార్లు నడుపుకొని జీవించే పేద డ్రైవర్లకు వైఎస్‌ఆర్‌ వాహనమిత్ర పథకం ద్వారా ఆర్థిక భద్రత కల్పించడం సంతోషించదగ్గ విషయమన్నారు. డీఆర్వో రఘనాధ్‌, డీటీసీ నాగేశ్వరరావు, ఆర్టీఓ శాంతకుమారి, వీరరాజు, మున్సిపల్‌ కమిషనర్‌ లవన్న, అధికారులు, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-05T10:31:40+05:30 IST