ఒక్కసారిగా పెరిగిన గిరాకీ.. లీటరు మేక పాలు ఎంతో తెలిస్తే..!

ABN , First Publish Date - 2021-10-24T09:30:33+05:30 IST

ధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌ పట్టణంలో మేక పాలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోయింది.

ఒక్కసారిగా పెరిగిన గిరాకీ.. లీటరు మేక పాలు ఎంతో తెలిస్తే..!

  • 300 కు పెరిగిన పాలు
  • డెంగీ రోగులు క్యూ కట్టడంతో ధరకు రెక్కలు


భోపాల్‌, అక్టోబరు 23: మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌ పట్టణంలో మేకపాలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోయింది. వారం కిందట లీటరుకు రూ.30 మాత్రమే ఉన్న మేక పాల ధర ఇప్పుడు రూ.300కు పెరిగింది. ఎందుకో తెలుసా ? ఇటీవల కాలంలో పట్టణ పరిసరాల్లో డెంగీ కేసులు పెరిగాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య పెరగాలంటే మేక పాలు తప్పకుండా తాగాల్సిందేననే ప్రచారం జరగడంతో పది రెట్లు ఎక్కువ ధర పెట్టి మరీ మేక పాలను ప్రజలు కొంటున్నారు. ఈ పరిణామం ఛత్తార్‌పూర్‌ పట్టణం శివారులోని గ్రామాల మేకల కాపరులకు కాసుల పంట పండిస్తోంది. ఇక.. డెంగీ వచ్చిన వారు మేకపాలు తాగాలనే నియమమేదీ లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - 2021-10-24T09:30:33+05:30 IST