పిడుగుపాటుకు మేకలు మృతి

ABN , First Publish Date - 2021-10-24T05:28:03+05:30 IST

మండల పరిధిలోని కనుమ కింది కొట్టాల సమీపంలోని పిడుగుపాటుకు 18 మేకలు మృతి చెందాయి.

పిడుగుపాటుకు మేకలు మృతి

బేతంచెర్ల, అక్టోబరు 23: మండల పరిధిలోని కనుమ కింది కొట్టాల సమీపంలోని పిడుగుపాటుకు 18 మేకలు మృతి చెందాయి. పొలంలోనే చెట్టు కింద మేకల మంద ఉన్న సమయంలో శనివారం సాయంత్రం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఇదే సమయంలో పిడుగు పడటంతో మేకలు మృతి చెందాయి. రూ.2.16 లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు తెలిపారు. ఎల్లయ్యకు చెందిన 14 మేకలు, ఈశ్వరయ్యకు చెందిన మేకలు 4 పిడుగుపాటుకు మృతి చెందాయి. జీవనాధారమైన మేకలు కోల్పోయామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.

Updated Date - 2021-10-24T05:28:03+05:30 IST