వెంకన్న అన్నదాన ట్రస్టుకు రూ.1.70లక్షల విరాళం

ABN , First Publish Date - 2021-10-17T06:46:05+05:30 IST

వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి నిత్యాన్న దాన పథకానికి దాతల నుంచి విరాళాలు అందజేశారు.

వెంకన్న అన్నదాన ట్రస్టుకు రూ.1.70లక్షల విరాళం

ఆత్రేయపురం, అక్టోబరు 16: వాడపల్లి శ్రీవేంకటేశ్వరస్వామి   నిత్యాన్న దాన పథకానికి దాతల నుంచి విరాళాలు అందజేశారు. ఆత్రేయపురానికి చెందిన ముదునూరి సోమరాజు, సత్యసూర్యభాస్కరం దంపతులు రూ.1,00, 114, రాజమహేంద్రవరానికి చెందిన సుబ్రహ్మణ్యం లక్ష్మణ్‌, రూ.10,001, ఏడిదకు చెందిన మేకా శ్రీనివాస్‌, రూ.10,116, గోకవరానికి చెందిన బద్దిరెడ్డి మినర్‌, పూజాఅలేఖ్య దంపతులు రూ.25వేలు, కృష్ణాజిల్లా వెనికేపాడుకు చెందిన పాకూరి నాగేశ్వరరావు, గీతాలక్ష్మి దంపతులు రూ.10,116, పశ్చిమ గోదావరి జిల్లా పడవం గ్రామానికి చెందిన కొత్త జగదీష్‌కుమార్‌ రూ.10 వేలు, హైదరాబాద్‌కు చెందిన కాట్రగడ్డ రమేష్‌, శివనాగమణి దంపతులు రూ.10వేలు, పొడగట్లపల్లికి చెందిన కొల్లూరి వెంకటసూర్యనారాయణ రూ.5వేలు అన్నప్రసాద ట్రస్టుకు విరాళాలు సమర్పించారు.   

Updated Date - 2021-10-17T06:46:05+05:30 IST