వైభవంగా గోదాదేవి కల్యాణం
ABN , First Publish Date - 2022-01-15T06:08:34+05:30 IST
ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం భోగి పండగ సందర్భంగా గోదాదేవి, రంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఈ వేడుకను శాస్త్రోక్తంగా జరిపారు.
ఉపమాకలో నేత్రపర్వంగా వేడుక
పోటెత్తిన భక్తజనం
నక్కపల్లి/ఎస్.రాయవరం, జనవరి 14 : ఉపమాక వేంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం భోగి పండగ సందర్భంగా గోదాదేవి, రంగనాథుల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు ఆధ్వర్యంలో ఈ వేడుకను శాస్త్రోక్తంగా జరిపారు. పెద్ద సంఖ్యలో భక్తులు తిలకించారు. ఇదిలావుంటే, దేవవరానికి చెందిన ఆచంట రామకృష్ణ దంపతులు స్వామివారికి అలంకరణ నిమిత్తం వెండి వరద హస్తం, కటి హస్తములను సమర్పించారు. అలాగే, ఎస్.రాయవరంలోని వేంకటేశ్వర ఆలయంలో స్వామి కల్యాణాన్ని జరిపించారు.
పాయకరావుపేట : పట్టణంలోని పలు ఆలయాల్లో గోదాదేవి కల్యాణాన్ని కన్నుల పండువగా జరిపారు. రాధారుక్మిణీ సమేత పాండురంగ ఆలయంలో ఈ వేడుకను మరింత ఘనంగా నిర్వహించారు. దేవస్థానం మాజీ చైర్మన్, వైసీపీ మండల అధ్యక్షుడు ధనిశెట్టి బాబూరావు, మాజీ సర్పంచ్ ధనిశెట్టి నాగమణి, నారపురెడ్డి పద్మావతి, గొల్లపూడి వీరభద్రరావు, చిక్కాల శ్రీనివాసరావు, జి.రామచంద్రరావు దంపతులతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.