కాసేపట్లో గోదావరి బోర్డు భేటీ
ABN , First Publish Date - 2020-06-05T16:52:57+05:30 IST
కాసేపట్లో గోదావరి బోర్డు భేటీ
హైదరాబాద్: గోదావరి బోర్డు మరికాసేపట్లో సమావేశంకానుంది. తెలుగు రాష్ట్రాల మధ్య జలవివాదాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. బోర్డు చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో జరిగే ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాలకు ఇరిగేషన్ శాఖ కార్యదర్శులు, ఈఎస్ఈలు, ఇతర అధికారులు పాల్గొననున్నారు. గోదావరి బేసిన్పై తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న కాళేశ్వరం, దేవాదుల, సీతారామ వంటి పలు ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం బోర్డుకు ఫిర్యాదు చేసింది. ఈ అంశాలపై చర్చించేందుకు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మరోవైపు కృష్ణాబోర్డు సమావేశంలో వాడీవేడిగా చర్చ జరిగింది.