బంగారం @ 50వేలు
ABN , First Publish Date - 2020-07-02T06:02:47+05:30 IST
బులియన్ మార్కెట్ పరుగులు పెడుతోంది. బుధవారం పసిడి, వెండి ధరలు మరింత పెరిగాయి. ఢిల్లీలో పది గ్రాముల మేలిమి బంగారం (24 కేరట్లు) ధర
న్యూఢిల్లీ: బులియన్ మార్కెట్ పరుగులు పెడుతోంది. బుధవారం పసిడి, వెండి ధరలు మరింత పెరిగాయి. ఢిల్లీలో పది గ్రాముల మేలిమి బంగారం (24 కేరట్లు) ధర రూ.647 పెరిగి రూ.49,908 దగ్గర ముగిసింది. కిలో వెండి ధరా రూ.1,611 పెరిగి రూ.51,870కి చేరింది. ఫ్యూచర్స్ మార్కెట్లో అయితే 10 గ్రాముల పుత్తడి ధర రూ.48,871కు చేరి రికార్డు సృష్టించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణాల్లోనూ ఈ ప్రభావం కనిపించింది. హైదరాబాద్, విజయవాడ, వైజాగ్ మార్కెట్లలో మార్కెట్లో 10 గ్రాముల మేలిమి బంగారం రూ.50,480 నుంచి రూ.50.950 మధ్య ట్రేడైంది. కిలో వెండి ధరా రూ.50,000 మించి పోయింది.