నేటి నుంచి పసిడి బాండ్ల ఇష్యూ
ABN , First Publish Date - 2021-03-01T06:33:11+05:30 IST
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించి 12వ విడత సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ) ఇష్యూ సబ్స్ర్కిప్షన్ సోమవారం ప్రారంభమవుతోంది. ఒక గ్రాము కు సమానమైన ఎస్జీబీ ధరను భారతీయ రిజర్వ్ బ్యాంక్...
- గ్రాము ధర రూ.4,662
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2020-21) సంబంధించి 12వ విడత సావరిన్ గోల్డ్ బాండ్స్ (ఎస్జీబీ) ఇష్యూ సబ్స్ర్కిప్షన్ సోమవారం ప్రారంభమవుతోంది. ఒక గ్రాము కు సమానమైన ఎస్జీబీ ధరను భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) రూ.4,662గా నిర్ణయించింది. ఈ నెల 5 వరకు ఈ బాండ్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. వాణిజ్య బ్యాం కులు, స్టాక్ హోల్డింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండి యా లిమిటెడ్ (ఎస్హెచ్సీఐఎల్), ఆర్బీఐ పేర్కొన్న పోస్టాఫీసులు లేదా బీఎ్సఈ, ఎన్ఎస్ఈ ద్వారా ఈ బాండ్స్ కోసం దరఖాస్తు చేయాలి.
ప్రధానాంశాలు..
- బాండ్ కాల పరిమితి ఎనిమిదేళ్లు. ఐదేళ్ల తర్వాత పెట్టుబడులను వెనక్కి తీసుకునే అవకాశం
- వ్యక్తిగత మదుపరులు కనీసం ఒక గ్రాము నుంచి గరిష్ఠంగా నాలుగు కిలోలకు సమానమైన ఎస్జీబీల కోసం దరఖాస్తు చేయవచ్చు
- అవిభక్త హిందూ కుటుంబాలు నాలుగు కిలోల వరకు, ట్రస్టులు, యూనివర్సిటీల వం టి సంస్థలు 20 కిలోలకు సమానమైన ఎస్జీబీలకు దరఖాస్తు చేయవచ్చు
- ఈ బాండ్స్పై 2.5 శాతం వార్షిక వడ్డీ. ప్రతి ఆరు నెలలకు మదుపరుల బ్యాంక్ ఖాతాలో వడ్డీ జమ
- ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసి డిజిటల్ పద్దతిలో చెల్లింపులు చేస్తే ప్రతి గ్రాము బాండ్పై రూ.50 డిస్కౌంట్
- రిడంప్షన్ సమయంలో వచ్చే మూలఽధన లాభాలపై ఆదాయ పన్ను మినహాయింపు
- బీఎ్సఈ, ఎన్ఎ్సఈల్లో ట్రేడయ్యేలా డీమ్యాట్ రూపంలో ఎస్జీబీలు కేటాయింపు