గోల్డ్‌ బైబ్యాక్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌

ABN , First Publish Date - 2020-09-27T07:45:25+05:30 IST

ఎంఎంటీసీ-పీఏఎంపీ.. బం గారం బైబ్యాక్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. తొలుత ఢిల్లీలోని లజ్‌పథ్‌ నగర్‌ సెంటర్‌లో ప్రారంభమైన ఈ ఆఫర్‌ను త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది...

గోల్డ్‌ బైబ్యాక్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌

  • ప్రారంభించిన ఎంఎంటీసీ-పీఏఎంపీ  


న్యూఢిల్లీ: ఎంఎంటీసీ-పీఏఎంపీ.. బం గారం బైబ్యాక్‌, ఎక్స్ఛేంజ్‌ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. తొలుత ఢిల్లీలోని లజ్‌పథ్‌ నగర్‌ సెంటర్‌లో ప్రారంభమైన ఈ ఆఫర్‌ను త్వరలోనే దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకురానుంది. నామమాత్రపు లావాదే వీ రుసుము చెల్లించడం ద్వారా కస్టమర్లు తాము విక్రయించబోయే లోహానికి గరిష్ఠ విలువను పొందే అవకాశం కల్పిస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. సొమ్ము కస్టమర్‌ బ్యాం క్‌ ఖాతాకు బదిలీ చేయడం జరుగుతుం ది. లేదంటే, 9999, 999, 995 స్వచ్ఛత లోహంతో ఎక్స్ఛేంజ్‌ చేసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది.  


Updated Date - 2020-09-27T07:45:25+05:30 IST