బంగారు గొలుసు విరాళంగా ఇచ్చిన మహిళకు ఉద్యోగం

ABN , First Publish Date - 2021-06-17T16:14:37+05:30 IST

మెట్టూర్‌ డ్యాం నీటిని విడుదల చేసేందుకు ఇటీవల సేలం వెళ్లిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వద్ద సీఎం సహాయనిధి కోసం 2 సవర్ల బంగారు గొలుసును విరాళంగా అందజేసిన ఓ మహిళకు వెంటనే ఉ

బంగారు గొలుసు విరాళంగా ఇచ్చిన మహిళకు ఉద్యోగం


ప్యారీస్‌(చెన్నై): మెట్టూర్‌ డ్యాం నీటిని విడుదల చేసేందుకు ఇటీవల సేలం వెళ్లిన ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ వద్ద సీఎం సహాయనిధి కోసం 2 సవర్ల బంగారు గొలుసును విరాళంగా అందజేసిన ఓ మహిళకు వెంటనే ఉద్యోగావకాశం కలిగింది. మెట్టూరు పోట్టనేరి ప్రాంతానికి చెందిన సౌమ్య అనే మహిళ స్టాలిన్‌ వద్ద తన మెడలో వున్న రెండు సవర్ల బంగారు గొలుసు ఇవ్వడంతో పాటు తనకు ఏదైనా ఉద్యోగావకాశం కల్పించాలంటూ దరఖాస్తు కూడా అందజేసింది. దీనిని పరిశీలించిన సీఎం.. సౌమ్య చదువును బట్టి తగిన ఉద్యోగావకాశం కల్పిస్తానని తన ట్విట్టర్‌ ద్వారా హామీనిచ్చారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్‌శాఖ మంత్రి సెంథిల్‌ బాలాజీ మంగళవారం సాయంత్రం సౌమ్య ఇంటికి నేరుగా వెళ్లి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగానికి సంబంధించిన నియామకపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆయన సౌమ్యకు శుభాకాంక్షలు తెలిపారు.

Updated Date - 2021-06-17T16:14:37+05:30 IST