Udipi జిల్లా మల్పెలో అరుదైన చేప లభ్యం

ABN , First Publish Date - 2021-11-25T18:12:04+05:30 IST

ఉడుపి జిల్లాలోని మల్పెలో అరుదైన చేప లభ్యమైంది. సోమవారం రాత్రి శాన్‌రాజ్‌తొట్టంకు చెందిన బలరాం అనే బోటులో చేపల వేటకు వెళ్లిన బృందానికి గోళి అనే 21 కిలోల చేప లభించింది. తిరిగి ఓడరేవుకు వచ్చాక

Udipi జిల్లా మల్పెలో అరుదైన చేప లభ్యం

బెంగళూరు: ఉడుపి జిల్లాలోని మల్పెలో అరుదైన చేప లభ్యమైంది. సోమవారం రాత్రి శాన్‌రాజ్‌తొట్టంకు చెందిన బలరాం అనే బోటులో చేపల వేటకు వెళ్లిన బృందానికి గోళి అనే 21 కిలోల చేప లభించింది. తిరిగి ఓడరేవుకు వచ్చాక మంగళవారం వేలం వేశారు. రూ.1.90లక్షలు పలికింది. దీంతో కిలో 9,060రూపాయలైంది. సాధారణంగా ఈ రకం చేపను ఔషధాల తయారీకి ఉపయోగిస్తుంటారు. ఫయాజ్‌ అనే వ్యక్తి ఈ చేపను కొనుగోలు చేశారు. ముంబై ఓడరేవులో ఈ చేప కిలో రూ.15వేల నుంచి 18వేల వరకు పలుకుతుందన్నారు. ముంబై నుంచి నేరుగా ఔషధ కంపెనీలే కొనుగోలు చేస్తాయన్నారు. గోళి రకం చేపలు రాళ్లమధ్యన ఉంటాయని వలకు దొరకడం అరుదు అన్నారు. మల్పెలో గోళిరకం చేప లభించడం చాలా అరుదు అని ఒక వేళ దొరికినా ఐదారు కిలోలకు మించవన్నారు. ఈసారి ఏకంగా 21కిలోల చేప లభించడం ఒక రికార్డుగా భావిస్తున్నట్టు చేపల వ్యాపారులు అభిప్రాయపడ్డారు. 

Updated Date - 2021-11-25T18:12:04+05:30 IST