శంషాబాద్ : జిప్పుల్లో బంగారం పట్టివేత

ABN , First Publish Date - 2020-03-17T14:55:56+05:30 IST

అక్రమంగా తరలిస్తున్న 1.335 కిలోల బంగారాన్ని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు సోమవారం పట్టుకున్నారు.

శంషాబాద్ : జిప్పుల్లో బంగారం పట్టివేత

హైదరాబాద్ : అక్రమంగా తరలిస్తున్న 1.335 కిలోల బంగారాన్ని శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయంలో కస్టమ్స్‌ అధికారులు సోమవారం పట్టుకున్నారు. షార్జా నుంచి ఎయిర్‌ అరేబియా జీ9458 విమానంలో వస్తున్న ప్రయాణికుడు బంగారాన్ని జిప్పుల రూపంలో తయారుచేసి ట్రావెల్‌ బ్యాగ్‌లో తీసుకొస్తూ కస్టమ్స్‌ అధికారుల తనిఖీలో పట్టుబడ్డాడు. అతడిని అదుపులోకి తీసుకొని విచారించగా బంగారానికి సంబంధించిన ఎలాంటి పత్రాలు చూపించలేదు. కేసు నమోదు చేసి బంగారాన్ని సీజ్‌ చేశారు. స్వాధీనం చేసుకున్న పసిడి విలువ రూ. 5.5 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితుడిని విచారణ నిమిత్తం కస్టమ్స్‌ ప్రధాన కార్యాలయానికి తరలించారు.  

Updated Date - 2020-03-17T14:55:56+05:30 IST