స్వామివారికి రూ. 40 లక్షల విలువైన పద్మములు
ABN , First Publish Date - 2021-12-09T05:11:24+05:30 IST
కాకినాడ వెంకట్నగర్లో వేంచేసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి భక్త బృందం బుధవారం రూ.40 లక్షలు విలువైన 108 అష్టదళ పద్మములు అందజేశారు.
భానుగుడి(కాకినాడ), డిసెంబరు 8: కాకినాడ వెంకట్నగర్లో వేంచేసిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి భక్త బృందం బుధవారం రూ.40 లక్షలు విలువైన 108 అష్టదళ పద్మములు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవదాయశాఖ డీసీ విజయరాజు, ఈవో బీవీఆర్ చౌదరి ఆలయ ప్రధాన అర్చకులకు అందజేశారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.