శంషాబాద్ ఎయిర్పోర్టులో బంగారం పట్టివేత
ABN , First Publish Date - 2021-11-25T00:07:29+05:30 IST
శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుసగా రెండవరోజు అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు.
శంషాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వరుసగా రెండవరోజు అక్రమంగా తరలిస్తున్న బంగారం పట్టుబడినట్లు కస్టమ్స్ అధికారులు తెలిపారు. షార్జా నుంచి ఓ ప్రయాణికుడు బుధవారం శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకున్నాడు. కస్టమ్స్ అధికారులు తనిఖీలు చేయగా అతడి చేతి గడియారం లోపలిభాగంలో అక్రమంగా తరలిస్తున్న 233.4గ్రాముల బంగారాన్ని గుర్తించారు. ఈ మేరకు బంగారాన్ని సీజ్చేసి నిందితున్ని అరెస్టు చేశారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.11.56లక్షలు ఉంటుందని చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.