కరోనా భయంతో గోల్డెన్ బాబా అంత్యక్రియలకు బంధువులు గైర్హాజరు!
ABN , First Publish Date - 2020-07-02T17:52:15+05:30 IST
యూపీలోని ఘజియాబాద్ ఉంటున్న గోల్డెన్ బాబా అలియాస్ సుధీర్ కుమార్ మక్కర్ ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గోల్డెన్ బాబా క్యాన్సర్కు చికిత్స పొందుతూ మృతిచెందారు.
ఘజియాబాద్: యూపీలోని ఘజియాబాద్ ఉంటున్న గోల్డెన్ బాబా అలియాస్ సుధీర్ కుమార్ మక్కర్ ఢిల్లీలోని ఎయిమ్స్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. గోల్డెన్ బాబా క్యాన్సర్కు చికిత్స పొందుతూ మృతిచెందారు. అయితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న కోవిడ్ భయం కారణంగా గోల్డెన్ బాబా అంత్యక్రియలకు బంధులెవరూ హాజరుకాలేదు. అయితే బాబా దహన సంస్కారాలను బంధువులు, పరిచయస్తులకు వీడియో కాల్ ద్వారా చూపించినట్లు బంధువు పునీత్ తెలిపారు. ఈ సందర్భంగా బాబా ఇంతకాలం ఉన్న సొసైటీ మాజీ ఆర్డబ్ల్యుఎ అధ్యక్షుడు వినోద్ పాండే మాట్లాడుతూ గోల్డెన్ బాబా తన భార్య వీణా మక్కర్, సెక్యూరిటీ గార్డులతో కలిసి దాదాపు ఏడేళ్లుగా ఇక్కడే ఉంటున్నారని చెప్పారు. ఏడాది కాలంగా బాబా క్యాన్సర్కు చికిత్స పొందుతున్నారన్నారు. ఆరోగ్యం మరింత దిగజారడంతో కన్నుమూశారని తెలిపారు.