సింహాచలేశునికి స్వర్ణ పుష్పార్చన

ABN , First Publish Date - 2021-10-22T05:57:28+05:30 IST

ప్రహ్లాద వరదుడైన సింహగిరివాసునికి వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు.

సింహాచలేశునికి స్వర్ణ పుష్పార్చన
స్వర్ణ సంపెంగలతో పూజలందుకున్న గోవిందరాజస్వామి

సింహాచలం, అక్టోబరు 21: ప్రహ్లాద వరదుడైన సింహగిరివాసునికి వైభవంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఆర్జిత సేవల్లో భాగంగా గురువారం ప్రభాత ఆరాధనల తర్వాత స్వామివారి ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని కళ్యాణ మండపంలో ప్రత్యేక వేదికపై ఉంచి భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పూజాది కార్యక్రమాలు జరిపి నృసింహ అష్టోత్తర శతనామాలను పఠిస్తూ స్వర్ణ సంపెంగలతో స్వామిని అర్చించారు. అనంతరం భక్తులకు శేషవస్త్రాలు, వేదాశీర్వచనాలు, ప్రసాదాలను అందజేశారు. ఆ తర్వాత ఇదే వేదికపై ఆర్జిత నిత్య కళ్యాణాన్ని సంప్రదయబద్ధంగా జరిపారు.  కాగా అప్పన్న స్వామిని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం దంతెవాడ ఎమ్మెల్యే దేవకి మహేంద్రకర్మ దర్శించుకున్నారు. 

Updated Date - 2021-10-22T05:57:28+05:30 IST