ఎస్పీ నేత హత్య ... 11 మంది అరెస్ట్

ABN , First Publish Date - 2020-04-04T12:59:18+05:30 IST

కరోనా వైరస్ ను ఎదుర్కొనేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ ప్రకటించింది, ఇది ఏప్రిల్ 14 వరకు...

ఎస్పీ నేత హత్య ... 11 మంది అరెస్ట్

గోండా:కరోనా వైరస్ ను  ఎదుర్కొనేందుకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ ప్రకటించింది, ఇది ఏప్రిల్ 14 వరకు కొనసాగుతుంది. ఈ సమయంలో యూపీలోని గోండా జిల్లాలో కలకలం రేపే సంఘటన చోటుచేసుకుంది. దీనితో సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ ఉదంతంలో  జోక్యం చేసుకోవలసి వచ్చింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గోండాలో జరిగిన కాల్పుల్లో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) నేతతో సహా ఇద్దరు మృతి చెందారు. ఈ కేసులో ఇద్దరు ప్రధాన నిందితులతో సహా 11 మందిని అరెస్టు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ తెలిపారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా మేజిస్ట్రేట్, పోలీసు సూపరింటెండెంట్‌కు ఆదేశాలు జారీచేశారు. ఈ ఘటనలో గాయపడినవారికి సరైన చికిత్స కోసం ఏర్పాట్లు చేయాలని సూచనలు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.... ఎస్పీ నేత లాతి సింగ్‌ను కొందరు దుండగులు కాల్చి చంపారు. ఈ కాల్పుల్లో ఎస్పీ నాయకుడితో సహా ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటనలో నలుగురు గాయపడ్డారు. ఇది పాత కక్షల కారణంగా జరిగిందని తెలుస్తోంది. 



Updated Date - 2020-04-04T12:59:18+05:30 IST