గ్రామ, వార్డు వాలంటీర్లకు శుభవార్త

ABN , First Publish Date - 2020-10-01T02:59:17+05:30 IST

గ్రామ, వార్డు వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి సేవలను మరో ఏడాది పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ

గ్రామ, వార్డు వాలంటీర్లకు శుభవార్త

అమరావతి: గ్రామ, వార్డు వాలంటీర్లకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారి సేవలను మరో ఏడాది పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ, వార్డు వాలంటీర్ల సేవలను మరో ఏడాది కాలం పాటు పొడిగిస్తూ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసింది. 2.6 లక్షల మంది గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్ల సేవలను ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి మరో ఏడాది పాటు పొడిగిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం దీని కోసం మరో 1560 కోట్ల  రూపాయల మేర గౌరవ వేతనం కింద చెల్లించాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో  ప్రభుత్వం స్పష్టం చేసింది.

Updated Date - 2020-10-01T02:59:17+05:30 IST