ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించిన గూగుల్ !
ABN , First Publish Date - 2020-05-28T13:22:07+05:30 IST
సాఫ్ట్వేర్ దిగ్గజం గూగుల్ జూలై 6 నుంచి తన కార్యాలయాలను పునఃప్రారంభిస్తోంది.
ప్రతి ఉద్యోగికి 75వేలు: గూగుల్
శాన్ఫ్రాన్సిస్కో, మే 27: సాఫ్ట్వేర్ దిగ్గజం గూగుల్ జూలై 6 నుంచి తన కార్యాలయాలను పునఃప్రారంభిస్తోంది. వర్క్ ఫ్రం హోం నుంచి ఆఫీస్కు వచ్చే తమ ఉద్యోగులకు ఫర్నీచర్ తదితర ఖర్చుల కోసం వెయ్యి డాలర్లు (సుమారు రూ.75వేలు) చొప్పున ఇవ్వాలని నిర్ణయించింది. ఈ ఏడాది చివరి వరకూ చాలా మంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేస్తారని గూగుల్ భావిస్తోంది.