8 నిమిషాల 46 సెకన్ల పాటు మౌనం పాటించిన గూగుల్!

ABN , First Publish Date - 2020-06-05T00:53:17+05:30 IST

గూగుల్ సంస్థ కూడా జార్జి ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ ఉద్యోగలు 8 నిమిషాల 46 సెకన్ల పాటు మౌనం పాటించి తమ సంఘీ భావం తెలిపారు.

8 నిమిషాల 46 సెకన్ల పాటు మౌనం పాటించిన గూగుల్!

వాషింగ్టన్: శేత్వజాతి కర్కవత్వానికి నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్ బలవడం అమెరికాను కుదిపేసింది. ఈ ఘటనకు నిరసనగా అగ్రరాజ్యంలో కనివినీ ఎరుగని రీతిలో ఆగ్రహజ్వాలలు ఎగసిపడుతున్నాయి. ప్రముఖ సంస్థలు, వ్యక్తలు ఇప్పటికే నిరసనకారులకు సంఘీ భావం ప్రకటించారు. ఈ నేపథ్యంలో గూగుల్ సంస్థ కూడా జార్జి ఫ్లాయిడ్‌కు నివాళులు అర్పిచింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న గూగుల్ ఉద్యోగలు 8 నిమిషాల 46 సెకన్ల పాటు మౌనం పాటించి తమ సంఘీ భావం తెలిపారు. అంతకుమునుపు గూగుల్ ఉద్యోగులకు రాసిన లేఖలో సంస్థ సీఈఓ సుందర్ పిచాయ్ ఈ విధంగా తమ మద్దతు తెలపాలని సూచించారు. పోలీసు కాలికింద 8 నిమిషాల 46 సెకన్ల పాటు నలిగి జార్జి ఫ్లాయిడ్ ప్రాణాలు విడిచి విషయం తెలిసిందే. దీంతో గూగుల్ కూడా అంతే సమయం పాటు మౌనం పాటిస్తూ ఈ కర్కశత్వాన్ని ఖండించింది.

Updated Date - 2020-06-05T00:53:17+05:30 IST