స్థానిక సంస్థల నిధుల మళ్లింపు దారుణం
ABN , First Publish Date - 2021-07-23T07:00:25+05:30 IST
స్థానిక సంస్థలకు చెందిన 14వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ బకాయిలకు వైసీపీ ప్రభుత్వం మళ్లించడం దారుణమని మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, మచిలీపట్నం నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ విమర్శించారు.
తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ
మచిలీపట్నం టౌన్ : స్థానిక సంస్థలకు చెందిన 14వ ఆర్థిక సంఘం నిధులను విద్యుత్ బకాయిలకు వైసీపీ ప్రభుత్వం మళ్లించడం దారుణమని మార్కెట్ యార్డు మాజీ చైర్మన్, మచిలీపట్నం నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ విమర్శించారు. పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. స్థానిక సంస్థల అభివృద్ధికి కేటాయించా ల్సిన 14వ ఆర్థికసంఘం నిధులు రూ.344. 93 కోట్లు విద్యుత్ బకాయిల పేరుతో ప్రభుత్వం లాక్కుందన్నారు. సర్పంచ్లను కీలుబొమ్మలను చేసి వలంటీర్లకు ప్రాధాన్యత కల్పించడం శోచనీయమన్నారు. ధాన్యం అమ్మి ఆరు నెలలైనా బకాయిలు ఇప్పటి వరకు రైతులకు చెల్లించలేదని దుయ్యబట్టారు. త్వరలో కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపడతామన్నారు. మాజీ కౌన్సిలర్ బత్తిన దాసు, నాయకులు పి.వి.ఫణికుమార్ తదితరులు పాల్గొన్నారు.