భోగి మంటల్లో ప్రజా వ్యతిరేక జీవో ప్రతులు
ABN , First Publish Date - 2022-01-15T06:19:36+05:30 IST
భోగి మంటల్లో ప్రజా వ్యతిరేక జీవో ప్రతులు
గొల్లపూడి, జనవరి 14: రాష్ట్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక జీవోల ప్రతులను టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పార్టీ నాయకులతో కలిసి గొల్లపూడిలో శుక్రవారం ఉదయం భోగి మంటల్లో వేసి దహనం చేసి నిరసన తెలిపారు. వడ్లమూడి చలపతిరావు, నర్రా వాసు, జాలిపర్తి గోపాలకృష్ణ, నూతులపాటి వెంకటేశ్వరరావు, గూడపాటి పద్మశేఖర్, ఎస్కే కరీముల్లా పాల్గొన్నారు.
శావల దేవదత్ ఆధ్వర్యంలో..
మునుకుళ్ల(తిరువూరు): పట్టణం, మండలంలోని గ్రామాల్లో టీడీపీ నియోజవకవర్గ ఇన్చార్జి శావల దేవదత్ ఆధ్వర్యంలో భోగిమంటలు వేసి ప్రజావ్యతిరేక జీవోల ప్రతులను దగ్ధం చేసి, నిరసన తెలిపారు. మునుకుళ్లలోని బోసుబొమ్మ సెంటర్లో టీడీపీ ఆధ్వర్యంలో భోగి మంటలు వేసి, పేదల ద్రోహి జగన్ దిగిపోవాలి, ధరలు దిగిరావాలి, విద్యుత్ చార్జీలు, ఓటీఎస్, నిత్యావసర వస్తువుల ధరల భారాల నుంచి ప్రజల్ని రక్షించాలని ప్రార్థించారు. వెదురు వెంకటనర్సిరెడ్డి, బొమ్మసాని మహేష్, పిట్టా చైతన్య, సింధు శ్రీను, మాదాల హరిచరణ్, మార్కండేశ్వరరావు, నాగరాజు, వెంకటేశ్వర్లు, రమాదేవి, కరీమ్ పాల్గొన్నారు.