ఏపీ నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించిన మంత్రి మేకపాటి

ABN , First Publish Date - 2020-08-10T20:31:27+05:30 IST

ఆంధ్రప్రదేశ్ నూతన పారిశ్రామిక విధానాన్ని పారిశ్రామిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు.

ఏపీ నూతన పారిశ్రామిక విధానాన్ని ఆవిష్కరించిన మంత్రి మేకపాటి

మంగళగిరి: ఆంధ్రప్రదేశ్ నూతన పారిశ్రామిక విధానాన్ని పారిశ్రామిక శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సోమవారం ఆవిష్కరించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో పాలసీ విడుదల చేశారు. అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కొత్త పారిశ్రామిక పాలసీని రూపొందించినట్లు మంత్రి తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ ఆలోచనలకు ప్రతిరూపమే కొత్త పారిశ్రామిక విధానమని అన్నారు. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీ మహిళా పారిశ్రామిక వేత్తలకు ప్రత్యేక రాయితీలు అందించనున్నట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఐఐసీ ఛైర్మన్ రోజా, పలువురు పారిశ్రామిక వేత్తలు పాల్గొన్నారు.

Updated Date - 2020-08-10T20:31:27+05:30 IST