సంగం స్వాధీన జీవో సస్పెన్షన్పై ధర్మాసనానికి ప్రభుత్వం అప్పీల్
ABN , First Publish Date - 2021-05-14T08:40:02+05:30 IST
సంగం డెయిరీని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవో 19ని సస్పెండ్ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ నెల 7వ తేదీన ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీలు చేసింది.
అమరావతి, మే 13 (ఆంధ్రజ్యోతి): సంగం డెయిరీని ప్రభుత్వ అధీనంలోకి తీసుకుంటూ ఇచ్చిన జీవో 19ని సస్పెండ్ చేస్తూ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ నెల 7వ తేదీన ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై ప్రభుత్వం ధర్మాసనం ముందు అప్పీలు చేసింది. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివ్దృద్ధిశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ అప్పీలు దాఖలు చేశారు. ఇది సోమవారం విచారణకు రానుంది.