గ్రామాభివృద్ధి కోసమే ఏకగ్రీవాలు: శ్రీకాంత్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-01-27T22:16:29+05:30 IST

గ్రామాల అభివృద్ధి కోసమే పంచాయతీల ఏకగ్రీవాలు చేసుకోవాలని ప్రభుత్వం చెబుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి తెలిపారు

గ్రామాభివృద్ధి కోసమే ఏకగ్రీవాలు: శ్రీకాంత్‌రెడ్డి

అమరావతి: గ్రామాల అభివృద్ధి కోసమే పంచాయతీల ఏకగ్రీవాలు చేసుకోవాలని ప్రభుత్వం చెబుతుందని ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల అభిప్రాయం మేరకే పంచాయతీల ఏకగ్రీవాలు జరుగుతాయని తెలిపారు. ప్రజలు అందరూ కొట్టుకోండి అనేటట్టు చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆరోపించారు. గ్రామాల్లో ప్రశాంతత కంటే చంద్రబాబుకి రాజకీయాలే ముఖ్యం అని విమర్శించారు. ఏకగ్రీవాలు వద్దు భారీగా నామినేషన్‌లు వేయండి అని దుర్మార్గముగా చంద్రబాబు మాట్లాడుతున్నారని శ్రీకాంత్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Updated Date - 2021-01-27T22:16:29+05:30 IST