రైతులను నాశనం చేస్తోన్న ప్రభుత్వం: సోమిరెడ్డి
ABN , First Publish Date - 2020-07-10T09:27:23+05:30 IST
వ్యవసాయ రంగానికి బడ్జెట్లో చేసిన కేటాయింపుల్లో కేవలం మూడో వంతు మాత్రమే ఖర్చు చేసి రైతులకు ఇంకా ఏదో చేస్తున్నట్లు వైసీపీ
వ్యవసాయ రంగానికి బడ్జెట్లో చేసిన కేటాయింపుల్లో కేవలం మూడో వంతు మాత్రమే ఖర్చు చేసి రైతులకు ఇంకా ఏదో చేస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం ప్రగల్భాలు పలుకుతోందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం ఆయన ఇక్కడ విలేకరులతో మాట్లాడారు. తన చర్యలతో ఈ ప్రభుత్వం రైతులను నాశనం చేస్తోందని, కరోనా సమయంలో పంటలు కొనే దిక్కులేక పండ్ల తోటలు, కూరగాయల తోటల రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సి వచ్చిందని ఆయన విమర్శించారు.