దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఇంద్రకరణ్‌రెడ్డి

ABN , First Publish Date - 2021-10-21T01:06:51+05:30 IST

రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు.

దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి: ఇంద్రకరణ్‌రెడ్డి

హైదరాబాద్: రాష్ట్రంలో దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని యాదాద్రి దేవాలయాన్ని దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దాలన్న దృఢ సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉన్నారన్నారు. ఇందులో భాగంగానే యాదాద్రి దేవాలయాన్ని బంగారుపూతతో తిరుమల తిరుపతి దేవస్థానానికి దీటుగా అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధికి పూజారులను నియమించి.. దూపదీప నైవేద్యం కార్యక్రమాలను చేపట్టామని ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు.

Updated Date - 2021-10-21T01:06:51+05:30 IST