కేంద్ర నిధులను దారి మళ్లిస్తున్న ప్రభుత్వం
ABN , First Publish Date - 2021-01-16T05:18:42+05:30 IST
కేంద్రం నిధులను దారి మళ్లించి కేసీఆర్ ప్రభుత్వం అడ్డంగా దోచుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్
మేడిపల్లి, జనవరి 15: కేంద్రం నిధులను దారి మళ్లించి కేసీఆర్ ప్రభుత్వం అడ్డంగా దోచుకుంటోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు. మేడిపల్లి మండలం గోవిందారంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ము ఖ్యమంత్రి రాక్షసుడిలా వ్యవహరిస్తున్నాడని బండి సంజయ్ అన్నారు. బీజేపీ కార్యకర్తల పై టీఆర్ ఎస్ కార్యకర్తలు దాడులు చేస్తూ అక్రమంగా కేసులు పెడుతున్నారని అన్నారు. బీజేపీ కార్యకర్తలపై దాడులు జరిగితే ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులు ఎందుకు స్పందిచడంలేదని బండి సంజయ్ ప్రశ్నించారు. తమ పార్టీ నాయకులపై, గానీ కార్యకర్తలపై గానీ దాడులకు పాల్పడితే ఉద్యమం ద్వారా కేసీఆర్కు బుధ్ది చెబుతామని హెచ్చరించారు. ఎన్నికలకు మం దు రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దాం కలిసి పని చేద్దాం అని ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోని నా యకులు ఇప్పుడు కలిసి పని చేద్దామని అనడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్ర అభివృద్ధికి బీజేపీకి చిత్తశుద్ధి ఉంది కాబట్టే ప్రజల చూపు బీజేపీ వైపు ఉందని బండి సంజయ్ స్పష్టం చేశారు.
మండలంలో సంజయ్ పర్యటన
మేడిపల్లి మండలంలోని 17 గ్రామాల్లో ఎంపీ బండి సంజయ్ పర్యటించారు. మేడిపల్లిలో షాపింగ్ కాంప్లెక్స్, మార్కెట్ యార్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. తొంబడర్రావుపేటలో సీసీ రోడ్డు, కట్లకుంటలో పార్టీ కార్యలయాన్ని ప్రారంభించారు. వల్లంపల్లి, మోత్కురావుపేట గ్రామాల్లో శివాజీ విగ్రహ నిర్మణానికి భూమి పూజ చేశారు, వెంకట్రావుపేట, కాచారంలో సీసీ రోడ్డు, గోవిందారంలో బస్టాడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఎంపీ పర్యటన సందర్భంగా మేడిపల్లిలో మైనార్టీ మహిళలు దాబాపై నుంచిపూలను ఎంపీపై చల్లి స్వాగతం పలికారు. అయన వెంట జిల్లా అధ్యక్షులు సత్యనారాయణరావు, సర్పంచ్లు ధర్మారెడ్డి, వరలక్ష్మి, తిరుపతిరెడ్డి, జగన్రెడ్డి, అభిలాష్, మధుకర్, ఎంపీటీసీలు, బీజేపీ నాయకులు దశరథరెడ్డి, శ్రీనివాస్గౌడ్, నారాయణరెడ్డి, జలపతిరెడ్డి, కార్యకర్తలు పాల్గొన్నారు.