కరోనాపై ప్రభుత్వ వైద్యుల కృషి అమోఘం
ABN , First Publish Date - 2020-05-17T10:19:24+05:30 IST
కరోనా పాజిటివ్ బాధితులకు ప్రభుత్వ వైద్యులు అందించిన వైద్యసేవల కారణంగానే త్వరగా కోలుకోని డిశ్చార్జి
ఒంగోలు(కలెక్టరేట్), మే 16 : కరోనా పాజిటివ్ బాధితులకు ప్రభుత్వ వైద్యులు అందించిన వైద్యసేవల కారణంగానే త్వరగా కోలుకోని డిశ్చార్జి అయ్యారని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు వినుకొండ రాజారావు అన్నారు. శనివారం స్థానిక పాత రిమ్స్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 63 పాజిటివ్ కేసులు నమోదు కాగా వారందరికీ ప్రభుత్వ వైద్యులు అందించిన వైద్యం వల్లే త్వరగా కోలుకున్నారని తెలిపారు.