రైతులను నట్టేట ముంచుతున్న వైసీపీ ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-01-21T06:35:16+05:30 IST

రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటూ వ్యవసాయ మోటర్లకు మీటర్లు ఏర్పాటు చేస్తామని రైతులను నట్టేటముంచు తున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు.

రైతులను నట్టేట ముంచుతున్న వైసీపీ ప్రభుత్వం

మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి

అమడగూరు, జనవరి 20 : రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటూ వ్యవసాయ మోటర్లకు మీటర్లు ఏర్పాటు చేస్తామని రైతులను నట్టేటముంచు తున్నారని మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని చౌడేశ్వరి కల్యాణ మండపంలో బుధవారం టీడీపీ మండల స్థాయి కమిటీలను ఎన్నుకున్నారు. ఈ సమావేశానికి ముఖ్య అతిఽథిగా ఆయన హాజరై మా ట్లాడుతూ రాష్ట్రంలో డీజల్‌, పెట్రోల్‌ ధరలు పెంచి పేద ప్రజల నడ్డివిరుస్తున్నారన్నారు. అదేవిధంగా విద్యుత చార్జీలు, ఆర్టీసీ బస్సు చార్జీలు పెంచి పేద ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నారన్నారు. స్థానిక ఎన్నికల్లో గ్రామస్థాయి నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు పార్టీ అభ్యర్థుల గెలుపునకు  కృషి చేయాలన్నారు. అనంతరం టీడీపీ మండల స్థాయి కమిటీలను ఎన్నుకున్నారు. మం డల కన్వీనర్‌గా రెండోసారి గోపాల్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మండల రైతు విభాగం అధ్యక్షుడిగా సుధాకర్‌రెడ్డి, ఉపాధ్యక్షుడిగా బాలకృష్ణ, కార్యదర్శి శంకర్‌నాయుడును ఎన్నుకున్నారు. తెలుగుమహిళా విభాగం అధ్యక్షురాలిగా ధనలక్ష్మీ, ఉపాధ్యక్షురాలిగా గోవిందమ్మ, జనరల్‌ సెక్రటరీగా రెడ్డెమ్మను ఎన్నుకున్నారు. ఎస్సీసెల్‌ విభాగం మండల అధ్యక్షుడిగా చంద్రశేఖర్‌, ప్రధాన కార్యదర్శి బీ చంద్రశేఖర్‌, ఉపాధ్యక్షుడిగా రెడ్డెప్ప, ఎస్టీ సెల్‌ విభాగం మండల అధ్యక్షుడిగా రామానాయక్‌, మైనార్టీ విభాగం నుంచి అధ్యక్షులుగా రహంతుల్లా, ప్రధాన కార్యదర్శి షఫీ, బీసీ సెల్‌ విభాగం అధ్యక్షులుగా నాగరాజు, ప్రధాన కార్యదర్శి తలారి చంద్రమోహనను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, జిల్లా తెలుగుయువత నాయకులు దివాకర్‌రెడ్డి, టీఎనఎ్‌సఎ్‌ఫ నాయకులు రామాంజులనాయుడు, నాయకులు క్రిష్ణారెడ్డి, భాస్కర్‌రెడ్డి, రఘువీరారెడ్డి, నాగేంద్రరెడ్డి, రవికుమార్‌, తిరుపాల్‌, జయరాం, రామాంజులు, రెడ్డెప్ప, డైరీ శ్రీనివాసులు, చాంద్‌బాష, ఈశ్వరరెడ్డి, సుధాకర్‌, ప్రసాద్‌, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


Updated Date - 2021-01-21T06:35:16+05:30 IST