పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2021-05-10T04:38:44+05:30 IST

ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమానికి పాటు పడుతుందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు.

పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
రంజాన్‌ కానుకలను పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే ఆత్రం సక్కు

- ఆసిఫాబాద్‌ ఎమ్మెల్యే ఆత్రం సక్కు

కెరమెరి, మే 9: ప్రభుత్వం పేద ప్రజలకు సంక్షేమానికి పాటు పడుతుందని ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. ఆదివారం కెరమెరి మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం రంజాన్‌ పండుగ సందర్భంగా ముస్లిం మైనార్టీ సోదరులకు మంజూరు చేసిన రంజాన్‌ గిఫ్ట్‌ ప్యాక్‌లను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ మోతీరాం, వైస్‌ఎంపీపీ అబ్దుల్‌కలాం, సర్పంచ్‌ నానేశ్వర్‌, మాజీ మార్కెట్‌కమిటీ చైర్మన్‌ మునీర్‌ అహ్మద్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

మాజీ ఎంపీపీ కుటుంబానికి పరామర్శ..

కెరమెరి మాజీ ఎంపీపీ దరావత్‌ హరిలాల్‌ కుటుంబ సభ్యులను ఆదివారం ఎమ్మెల్యే ఆత్రం సక్కుతోపాటు ఆదిలాబాద్‌ జడ్పీచైర్మన్‌ రాథోడ్‌ జనార్దన్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా హరిలాల్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. వారి వెంట మాజీ ఎంపీపీ మోతీరాం, వైస్‌ ఎంపీపీ అబ్దుల్‌ కలాం, మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మునీర్‌ అహ్మద్‌, సర్పంచ్‌లు, తదితరులు ఉన్నారు.


Updated Date - 2021-05-10T04:38:44+05:30 IST