వైకుంఠధామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి : ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2021-06-23T06:31:41+05:30 IST
రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠధామాల అభివృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు.
హుజూర్నగర్, జూన్ 22: రాష్ట్ర ప్రభుత్వం వైకుంఠధామాల అభివృద్ధికి కృషి చేస్తోందని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. హుజూర్నగర్ పట్టణంలోని మహాప్రస్థానాన్ని ఆయన మంగళవారం పరిశీలించారు. మహాప్రస్థానంలో కావాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలు పూర్తి చేయిస్తానన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి పేద వాడికి సంక్షేమ పథకాలు అందేలా చూస్తుందన్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతో రైతుల పక్షపాతిగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు చిట్యాల అమరనాధ్రెడ్డి, తాటి ప్రభాకర్రెడ్డి, పశ్య చంద్రారెడ్డి, కంచర్ల రాంరెడ్డి, పులిచింతల అంజిరెడ్డి, రాంశెట్టి రామునాయుడు, కోట సూర్యప్రకాశ్రావు, సైదులు, జనార్ధన్ పాల్గొన్నారు.