సాగుకు సర్కారు అండ
ABN , First Publish Date - 2020-09-20T08:48:53+05:30 IST
సాగుకు సర్కా రు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవ సాయ శాఖమంత్రి నిరంజన్రెడ్డి అన్నారు...
మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి
వనపర్తి అర్బన్, సెప్టెంబరు19: సాగుకు సర్కా రు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని రాష్ట్ర వ్యవ సాయ శాఖమంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. పట్ట ణంలోని తన నివాసంలో జిల్లా షెడ్యూల్ కులాల సహకార సంస్థ ద్వారా మంజూరైన చెక్కులను 16 మంది లబ్ధిదారులకు అందించారు. జిల్లాలోని పె బ్బేరు, ఆత్మకూర్ మండలాల్లోని మునగమాన్దిన్నె, రామమ్మపేట, జూరాలలోని మూడు ఎకరాల రైతు లకు పంటల సాగుకు మంజూరైన వంద శాతం సబ్సిడీ కింద మంజూరైన రూ.6లక్షలను పంపిణీ చేశారు. మునిసిపల్ వైస్ చైర్మన్ వాకిటీ శ్రీధర్, రమేష్గౌడ్, తిరుమల్ తదితరులు పాల్గొన్నారు.
వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి
పెద్దమందడి: అధికారులు ప్రత్యేక చొరవ తీ సుకొని వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలని మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు. ఎంపీపీ మే ఘారెడ్డి అధ్యక్షతన శనివారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంలో పని చేస్తున్న వివిధశాఖల అధికారుల నిర్లక్ష్యం వీడి ప్ర జలను అందుబాటులో ఉండిపని చేయాలని సూ చించారు. 13మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు.
పక్షం రోజుల్లో పూర్తి చేయాలి
వనపర్తి కలెక్టరేట్: రైతు వేదికల నిర్మాణాలను పక్షం రోజుల్లో పూర్తి చేసి అప్పగించాలని మంత్రి నిరంజన్రెడ్డి ఆదేశించారు. ఆర్డీవో కార్యాలయ స మావేశ మందిరంలో శనివారం రైతు వేదికల నిర్మా ణాలపై పీఆర్, ఆర్అండ్బీ అధికారులతో సమీక్షా సమా వేశం నిర్వహించారు.
వనపర్తి కలెక్టరేట్: జిల్లాలో ఆక్రమణకు గురయిన చెరువులు, నాలాలు, కుంటలు, ఎఫ్టీఎల్ స్థలాలను గుర్తించడానికి ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేస్తున్నట్లు కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. ఆమె తన చాంబర్లో వర్షాల కా రణంగా నిండిన చెరువులు, కుంటలు, వాటి నీటి సామర్థ్యంపై శనివారం సమీక్ష జరిపారు. అదనపు కలెక్టర్ వేణుగోపాల్ తదితరులు పాల్గొన్నారు.