ఉద్యోగులు లేనిదే ప్రభుత్వమే లేదు: సజ్జల
ABN , First Publish Date - 2021-10-13T19:57:07+05:30 IST
ఉద్యోగులు లేనిదే ప్రభుత్వమే లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ
అమరావతి: ఉద్యోగులు లేనిదే ప్రభుత్వమే లేదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పథకాల అమలు ఉద్యోగుల భుజస్కంధాలపై ఉందని చెప్పారు. ఆర్టీసీ సుదీర్ఘ డిమాండ్ను నెరవేర్చి ప్రభుత్వంలోకి తీసుకున్నామని తెలిపారు. ఇటీవల జీతాలు ఆలస్యమవుతున్న మాట వాస్తవమేనని, రెండేళ్లుగా కరోనా మూలంగా ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని సజ్జల పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే చిన్న చిన్న సమస్యలు వస్తున్నాయని, ఐఆర్ ఇస్తుండడంతో ఇంక్రిమెంట్ ఆలస్యం అవుతుందన్నారు. పీఆర్సీ సమస్య ఈ నెలాఖరుకు కొలిక్కి వస్తుందని ప్రకటించారు. వచ్చే నెలాఖరుకు ఉద్యోగుల సమస్యలు పరిష్కారమవుతాయని తెలిపారు. జీతాలు ఫస్ట్ ప్రయారిటీ కింద తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నాయని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.