మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2021-10-18T06:08:28+05:30 IST

మహిళా సాధికారతే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి పేర్కొన్నారు.

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి

గుడిబండ, అక్టోబరు 17: మహిళా సాధికారతే వైసీపీ ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే డాక్టర్‌ తిప్పేస్వామి పేర్కొన్నారు. ఆదివారం గుడిబండ జిల్లా పరిషత ఉన్నత పాఠశాల ఆవరణంలో వైఎ్‌సఆర్‌ ఆసరా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహనరెడ్డి పాదయాత్రలో మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకే వైఎస్సార్‌ ఆసరా పథకం ద్వారా కోట్లాది రుణాలు మహిళా సంఘాల సభ్యులకు అందిస్తున్నారన్నారు. మహిళల అభివృద్ధి కోసం సీఎం జగన్మోహనరెడ్డి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అందిస్తున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం అందించే రుణాలను మహిళలు తీసుకుని వాటిని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలని పిలుపునిచ్చారు. అనంతరం మహిళా సంఘల సభ్యులకు రూ.6.21 కోట్ల రుణాల చెక్కును అందజేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ రాధమ్మ, జడ్పీటీసీ భూతరాజు, వైస్‌ ఎంపీపీ రవికుమార్‌, సింగిల్‌ విండో అధ్యక్షుడు చంద్ర శేఖర్‌, నాయకులు నాగన్న, శివకుమార్‌, సర్పంచులు సతీష్‌, డీఎల్‌ ఎంజారేగౌడు, రంగస్వామి, లక్ష్మీనారాయణ, కవిత, తిప్పేస్వామి, గౌరమ్మ, వడ్డిగేరప్ప, అధికారులు పాల్గొన్నారు.



Updated Date - 2021-10-18T06:08:28+05:30 IST