కొవిడ్ కట్టడిలో ప్రభుత్వం విఫలం : టీడీపీ
ABN , First Publish Date - 2021-06-18T05:17:50+05:30 IST
కొవిడ్ కట్టడిలో ప్రభుత్వం విఫలం : టీడీపీ
పలాస : కరోనా సహాయకచర్యల్లో రాష్ట్ర ప్రభుత్వం విఫలమయ్యిందని, నిర్లక్ష్యం వల్లే లక్షలాది మంది మృతిచెందారని టీడీపీ నాయకులు ఆరోపించారు. గురువారం పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పీరుకట్ల విఠల్రావు, మునిసిపల్ మాజీ చైర్మన్ వజ్జ బాబూరావు, పార్టీ పట్టణాధ్యక్షుడు లొడగల కామేశ్వరరావు యాదవ్, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి తమ్మినేని గంగారాం విలేకరులతో మాట్లాడారు. కరోనా విజృంభిస్తున్న సమయంలో అధికారులను అప్రమత్తం చేయలేదని ఆరోపించారు. సమావేశంలో నాయకులు గురిటి సూర్యనారాయణ, బడ్డ నాగరాజు, సాంబమూర్తి పాల్గొన్నారు.