ఆలయాలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలం: విశ్వ ప్రసన్నతీర్థ స్వామి
ABN , First Publish Date - 2021-01-17T00:16:41+05:30 IST
రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని
విజయనగరం: రాష్ట్రంలో ఆలయాలపై వరుసగా దాడులు జరుగుతున్న ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదని ఉడిపీ పీఠాధిపతి శ్రీ విశ్వ ప్రసన్న తీర్థ స్వామి ప్రశ్నించారు. శనివారం స్వామీజీ మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ఆలయాలకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ దాడులు డబ్బులు కోసం కాదు హిందుత్వంపై దాడులేనని అన్నారు. ఏపీలో ఆలయాలపై దాడుల విషయంలో కేంద్రం కలుగజేసుకోవాలన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలయాలపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షించాలని విశ్వ ప్రసన్నతీర్థ స్వామి డిమాండ్ చేశారు.