‘కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం’

ABN , First Publish Date - 2020-08-04T09:47:52+05:30 IST

రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కొత్త సచివాలయం కాదు..

‘కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలం’

పంజాగుట్ట, ఆగస్టు 3 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా నియంత్రణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, కొత్త సచివాలయం కాదు.. కరోనా నుంచి ప్రజలను కాపాడాలని తెలంగాణ రాష్ట్రీయ లోక్‌దళ్‌ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీ్‌పకుమార్‌ అన్నారు. టీఆర్‌ఎల్‌డీ రాష్ట్ర అధ్యక్షుడిగా దిలీ్‌పకుమార్‌ను పార్టీ జాతీయ అధ్యక్షుడు అజిత్‌సింగ్‌ ఇటీవల నియమించారు. ఈ సందర్భంగా సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను ప్రభుత్వం నిర్లక్ష్యం, నిర్వీర్యం చేస్తోందని ఆరోపించారు. మనం కోరుకున్న తెలంగాణ రాలేదని ఆయన అన్నారు.

Updated Date - 2020-08-04T09:47:52+05:30 IST