కాన్పుల వార్డులో ఉక్కపోతతో అల్లాడిపోతు బాలింతలు

ABN , First Publish Date - 2022-04-10T13:40:06+05:30 IST

కాన్పుల వార్డులో బాలింతలు ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఒకే మంచంపై ఇద్దరు బాలింతలను, రెండు మంచాల్లో

కాన్పుల వార్డులో ఉక్కపోతతో అల్లాడిపోతు బాలింతలు

అనంతపురం: కాన్పుల వార్డులో బాలింతలు  ఉక్కపోతతో అల్లాడిపోతున్నారు. ఒకే మంచంపై ఇద్దరు బాలింతలను, రెండు మంచాల్లో ముగ్గురు బాలింతలను ఉంచుతున్నారు. పడకల కొరతతో వైద్య సిబ్బంది నిస్సహాయస్థితిలో ఉండిపోతున్నారు. సిజేరియన చేయించుకున్న బాలింతలను ఇద్దరు ముగ్గురిని ఒకేచోట ఉంచడంతో వారు మరింత ఇబ్బంది పడుతున్నారు. ఫ్యానలు సరిగా పనిచేయవు, పడకలు ఫుల్‌గా ఉంటున్నాయి. దీంతో బాధితులు నరకం అనుభవిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో బాలింతలు, పసిపిల్లల అవస్థలు చూడలేక బంధువులు శనివారం వైద్య సిబ్బందితో గొడవకు దిగారు. నర్సులు ఇక్కడ మంచాలు లేవు, ఇబ్బందులు పడుతూ ఉండాల్సిందేనని సమాధానం ఇవ్వడంతో బాలింతల బంధువులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సౌకర్యాలు లేనప్పుడు ఎందుకు చేర్చుకున్నారని,  ఈ పరిస్థితి ఉందంటే మరో ప్రైవేట్‌ ఆస్పత్రికి వెళ్లేవాళ్లం కదా అని గొడవకు దిగారు. 

Updated Date - 2022-04-10T13:40:06+05:30 IST