Priyanka gandhi : ప్రభుత్వం భయపడుతోంది
ABN , First Publish Date - 2021-07-31T22:16:55+05:30 IST
ధరల పెరుగుదలతో పాటు మరిన్ని అంశాలపై సభలో చర్చించడానికి ప్రభుత్వం భయపడుతోందని
న్యూఢిల్లీ : ధరల పెరుగుదలతో పాటు మరిన్ని అంశాలపై సభలో చర్చించడానికి ప్రభుత్వం భయపడుతోందని కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఎద్దేవా చేశారు. ‘‘మామిడి పండ్లను ఎలా తినాలి?వంటి చిన్న చిన్న అంశాలను చర్చిస్తారు. కానీ నిత్యావసర ధరల పెంపుపై మాత్రం కిమ్మనరు. వాటి గురించి చర్చించడానికే భయపడతారు’’ అంటూ ట్విట్టర్ వేదికగా ప్రియాంక ఎద్దేవా చేశారు. అయితే పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మాత్రం తాము అన్ని అంశాలపై చర్చించడానికి సిద్ధంగానే ఉన్నామని ప్రకటించారు.