ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2022-01-19T04:58:37+05:30 IST

ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి

ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలి
ధర్నా అనంతరం తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేస్తున్న బీజేవైఎం నాయకులు

కడ్తాల్‌: రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్‌ విడుదల చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో మంగళవారం కడ్తాల్‌ తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట నాయకులు, కార్యకర్తలు బైటాయించి ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజైవైఏం నాయకులు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులను అన్నివిధాలుగా మోసం చేస్తోందన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ఉద్యోగాల భర్తీకి వెంటనే నోటీఫికేషన్‌ భర్తీ చేయాలని, లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అనంతరం తదితర డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని తహసీల్దార్‌ మహేందర్‌రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు భగీరథ్‌, ప్రేమ్‌రాజ్‌, వినయ్‌, కొప్పు కృష్ణ, బీజేపీ మండల అధ్యక్షుడు మన్యానాయక్‌, జంగం వెంకటేష్‌, దోనాదుల మహేష్‌, కుమార్‌, శ్రీశైలం, ప్రేమ్‌ కుమార్‌, విజయ్‌కుమార్‌, మహేష్‌, శేఖర్‌, మల్లేష్‌, ప్రవీణ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T04:58:37+05:30 IST