ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి

ABN , First Publish Date - 2022-01-19T06:54:14+05:30 IST

నిరుద్యోగ యువత చేతుల్లోనే టీఆర్‌ ఎస్‌ సర్కార్‌ భవిష్యత్‌ ఉందని బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి చింత అని ల్‌ అన్నారు.

ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలి
అర్బన్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో వినతిపత్రం అందిస్తున్న బీజేవైఎం నాయకులు

బీజేవైఎం జిల్లా ప్రధానకార్యదర్శి చింత అనిల్‌ 

నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్‌ 

జగిత్యాల అర్బన్‌, జనవరి 18: నిరుద్యోగ యువత చేతుల్లోనే టీఆర్‌ ఎస్‌ సర్కార్‌ భవిష్యత్‌ ఉందని బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి చింత అని ల్‌ అన్నారు. బీజేవైయం రాష్ట్ర శాఖ ఆదేశాల మేరకు బీజేవైయం పట్టణ అధ్యక్షుడు కోండ్ర రవితేజ ఆధ్వర్యంలో పట్టణంలోని స్థానిక అర్బన్‌ త హసీల్దార్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, తహసీల్దార్‌ కార్యాల య అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా చింత అనిల్‌ మా ట్లాడుతూ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేయడంతో పాటు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నిరుద్యో గుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్‌ఎస్‌ భవిష్యత్‌ నిరుద్యోగుల చేతుల్లోనే ఉందనే విషయాన్ని సీఎం గుర్తుంచుకో వాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవై యం పట్టణ అధ్యక్షుడు రవి తేజ, ఉపాధ్యక్షుడు ఉమేష్‌, నగర ఉపాధ్య క్షుడు వినీత్‌, మహేష్‌, నరేంధర్‌, రమణతో పాటు బీజేవైయం నాయ కులు పాల్గొన్నారు.

Updated Date - 2022-01-19T06:54:14+05:30 IST