స్వచ్ఛ తెలంగాణకు ప్రభుత్వం చర్యలు

ABN , First Publish Date - 2021-02-25T04:08:55+05:30 IST

స్వచ్ఛ తెలంగాణ కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు.

స్వచ్ఛ తెలంగాణకు ప్రభుత్వం చర్యలు
సులభ్‌ కాంప్లెక్స్‌ను ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కోనేరు కోనప్ప

-సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప 

కాగజ్‌నగర్‌ టౌన్‌, ఫిబ్రవరి24: స్వచ్ఛ తెలంగాణ కోసం ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోందని సిర్పూర్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప అన్నారు. కాగజ్‌నగర్‌ పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌ ఎదురుగా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన ప్రజా మరుగుదొడ్లను బుధవారం మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాగజ్‌నగర్‌కు ఆయా ప్రాంతాల నుంచి రాకపోకలు సాగించే ప్రజల సౌకర్యార్థం ప్రజా మరుగుదొడ్లు నిర్మించామన్నారు.  పట్టణంలో ప్రత్యేక నిధులతో డ్రైనేజీలు, కల్వర్టులు నిర్మిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కమిషనర్‌ శ్రీనివాస్‌, ఆర్‌ఒ బాపు, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-02-25T04:08:55+05:30 IST