ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తున్న ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-10-25T06:06:35+05:30 IST

వరి ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధరను కల్పిస్తుందని ఏఎంసీ చైర్మన బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక వ్య వసాయ మార్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోళ్లపై రైతులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తున్న ప్రభుత్వం
చౌటుప్పల్‌లో పోస్టర్‌ను విడుదల చేస్తున్న ఏఎంసీ చైర్మన శ్రీనివాస్‌ రెడ్డి

ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తున్న ప్రభుత్వం

చౌటుప్పల్‌టౌన, అక్టోబరు 24: వరి ధాన్యానికి ప్రభుత్వం మద్దతు ధరను కల్పిస్తుందని ఏఎంసీ చైర్మన బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక వ్య వసాయ మార్కెట్‌ యార్డులో ధాన్యం కొనుగోళ్లపై రైతులకు నిర్వహించిన అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధాన్యాన్ని రైతులు కల్లాల వద్దనే  ఆరబెట్టడంతో పాటు శుభ్రం చేసుకొని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని కోరా రు. ఏ గ్రేడ్‌ ధాన్యానికి క్వింటాల్‌కు రూ.1960, కామన గ్రేడ్‌ క్వింటాల్‌కు రూ.1940 చెల్లిస్తామని ఆయన వివరించారు. అనంతరం పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కా ర్యక్రమంలో ఏఎంసీ సెక్రటరీ ఫసియొద్దిన, డైరెక్టర్లు మంచికంటి భాస్కర్‌, నవీనరెడ్డి, నాయకులు ప్రభాకర్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి, బాలకృష్ణ పాల్గొన్నారు.



Updated Date - 2021-10-25T06:06:35+05:30 IST