ప్రభుత్వ నిబంధనలు పాటించాలి: డీఎస్పీ
ABN , First Publish Date - 2020-05-16T10:22:22+05:30 IST
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ ప్రజలు అధికారులకు సహకరించాలని
పాల్వంచ రూరల్, మే 15: కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ ప్రజలు అధికారులకు సహకరించాలని పాల్వంచ డీఎస్పీ ప్రసా ద్రావు అన్నారు. శుక్రవారం డీఎస్పీ కార్యాల యంలో కరోనా నిబంధనలు.. చట్టపరమైన చర్యలపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భం గా డీఎస్పీ మాట్లాడుతూ కరోనా వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ప్రభుత్వం విధించిన నిబంధనలు ప్రజలు పాటించా లన్నారు.
ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే దుకాణాలు తెరిచి ఉంచాలన్నారు. నిర్ధిష్ట సమయం తర్వాత తెరిచి ఉంచితే భారీ జరిమా నాలు విధిస్తామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు సాయంత్రం 6గంటల తర్వాత బయట సంచ రించేం దుకు అనుమ తిస్తామన్నారు. స మావేశంలో పాల్వం చ మునిసిపల్ కమిషనర్ చింతా శ్రీకాంత్, పాల్వంచ సర్కిల్ ఇన్స్పెక్టర్ నవీన్, టౌన్ ఎస్ఐ ప్రవీణ్, రూరల్ ఎస్ఐ శ్రీధర్ పాల్గొన్నారు.